
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: నేషనల్ మెడికల్ కౌన్సిల్( ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా నారాయణపేట మెడికల్ కాలేజీలో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. శనివారం మండలంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి విజిట్ చేశారు.
జిల్లా ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. జనరల్ వార్డులో పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలను తెలుసుకున్నారు. మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కు కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. మెడికల్ కాలేజీకి ఏమైనా వసతులు అవసరమైతే రిపోర్టు ఇవ్వాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వర్, మెడికల్ కాలేజీ డైరెక్టర్ రమేశ్, వైద్య నిపుణులు ఆదిత్య, టీజీ ఎమ్ఐడీసీ డీఈ కృష్ణమూర్తి, ఏఈ సాయి మురారి ఉన్నారు.