
‘మనం’ లాంటి సూపర్ హిట్ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్. దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించాడు. టీజర్తో ఇంప్రెస్ చేసిన టీమ్, నిన్న ఓ పాటను విడుదల చేశారు. ‘ఏంటో ఏంటేంటో.. నాలో ఏంటేంటో, నాతో నువ్వేంటో.. నీతో నేనేంటో, చూసే చూపేంటో.. మారే తీరేంటో, వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో’ అంటూ మెలోడియస్గా సాగే ఈ పాటను తమన్ కంపోజ్ చేశాడు. అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, జోనిత గాంధీ పాడింది. టీనేజ్ జంటగా నాగచైతన్య, మాళవిక కనిపిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటోంది. జులై 8న సినిమా విడుదల కానుంది.