
Eppeltone Engineers IPO: చాలా కాలం తర్వాత ఐపీవోలు భారీ లాభాలను అందించటం తిరిగి స్టార్ట్ అయ్యాయి. ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రభావితం అయినప్పటికీ ఐపీవోలు మాత్రం మెరుగైన పనితీరునే కనబరిచాయి. కష్టకాలంలోనూ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తూ ముందుకు సాగాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎపెల్టోన్ ఇంజనీర్స్ ఐపీవో గురించే. వాస్తవానికి ఇది ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చింది. కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈలో ఒక్కోటి 90 శాతం ప్రీమియం ధర రూ.243.20 వద్ద ఒక్కోటి జాబితా అయ్యాయి. అయితే లిస్టింగ్ అయిన తర్వాత కూడా ఇన్వెస్టర్ల నుంచి కొనసాగిన డిమాండ్ కారణంగా కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి. దీంతో పెట్టుబడిదారులో మెుదటి రోజు తమ ఇన్వెస్ట్మెంట్ పై ఏకంగా 99.49 శాతం రాబడిని అందుకున్నారు.
వాస్తవానికి కంపెనీ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం జూన్ 17 నుంచి 19 వరకు అందుబాటులో ఉంచబడింది. తాజా ఐపీవో నుంచి కంపెనీ రూ.43 కోట్ల96 లక్షలను విజయవంతంగా సమీకరించగలిగింది. ఇందుకోసం 34.34 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. కంపెనీ లాట్ పరిమాణాన్ని 1000 షేర్లుగా నిర్ణయించింది. ఐపీవో ఇష్యూ సమయంలో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.12 కోట్ల 52 లక్షలను సమీకరించింది.
►ALSO READ | ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి బ్రేక్.. మార్కెట్ల మెగా ర్యాలీకి కారణాలివే..
కంపెనీ ఐపీవో మూడు రోజుల సబ్ స్క్రిప్షన్ కాలంలో 296 సార్లు ఓవర్ సబ్స్క్రైబ్ చేయబడింది. ప్రధానంగా కంపెనీ నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనను చూసింది.
కంపెనీ వ్యాపారం..
1977లో స్థాపించబడిన ఎప్పెల్టోన్ ఇంజనీర్స్ లిమిటెడ్, స్మార్ట్ మీటర్లతో సహా ఎలక్ట్రానిక్ ఎనర్జీ మీటర్ల తయారీ వ్యాపారంలో ఉంది. UPS సిస్టమ్స్, హై-గ్రేడ్ ఛార్జర్ల వంటి వివిధ పవర్ కండిషనింగ్ పరికరాలతో పాటు AVR, MCB, ట్రాన్స్డ్యూసర్లతో సహా విభిన్న ఉత్పత్తుల శ్రేణిని తయారు చోస్తోంది. కంపెనీ స్టాటిక్ వాట్ అవర్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు, వాటర్ మీటర్లు, BPL కిట్లు, UPS సిస్టమ్లు, LED లుమినరీలు, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్లు, ఛార్జర్లు, ప్యాక్లు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, 4.5KW నియంత్రిత అత్యవసర ఛార్జర్లు, షార్ట్ న్యూట్రల్ సెక్షన్ అసెంబ్లీలు, తేలికపాటి ఇన్సులేటర్ అసెంబ్లీలు, మాడ్యులర్ కాంటిలివర్ సిస్టమ్లు, ఆటో టెన్షనింగ్ పరికరాల రూపకల్పన, సరఫరాలో నిమగ్నమై ఉన్న ఒక సర్టిఫైడ్ సంస్థ.