హైదరాబాద్, వెలుగు: వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. గతంలోనూ తనకు టికెట్ రాకుండా కడియం శ్రీహరి కుట్రలు చేసి అడ్డుకున్నాడని ఆయన ఆరోపించారు. ఇప్పుడు టికెట్ ఇస్తే ఆయన బిడ్డ మీద పోటీ చేస్తానన్నారు.
శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి అండగా నిలిచిన తన లాంటి ఎంతో మందిని కాదని కడియం శ్రీహరి లాంటి నాయకులకు కేసీఆర్ అవకాశాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.