కామారెడ్డిలో కందుల కొనుగోలుకు ఐదు సెంటర్ల ఏర్పాటు

కామారెడ్డిలో కందుల కొనుగోలుకు ఐదు సెంటర్ల ఏర్పాటు

కామారెడ్డి, వెలుగు: జిల్లాలో కందుల కొనుగోలుకు ఐదు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్​కలెక్టర్​ చంద్రమోహన్​ తెలిపారు. బుధవారం కందుల కొనుగోళ్లపై ఆఫీసర్లతో ఆయన మాట్లాడుతూ.. మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, గాంధారి, పిట్లం మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 21 వేల హెక్టర్లలో కంది పంట సాగులో ఉందన్నారు. 10 వేల మెట్రక్​ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్ ​భాగ్యలక్ష్మీ, మార్కెటింగ్​ఆఫీసర్​రమ్య, డీసీవో శ్రీనివాస్​రావు 
పాల్గొన్నారు.