ఈటల తప్పుడు రిపోర్టు ఇచ్చారు.. త్వరలోనే కమిషన్కు లేఖ రాస్తా: మంత్రి తుమ్మల

ఈటల తప్పుడు రిపోర్టు ఇచ్చారు.. త్వరలోనే కమిషన్కు లేఖ రాస్తా: మంత్రి తుమ్మల

కాళేశ్వరం కమిషన్ కు ఈటల రాజేందర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని మంత్రి తుమ్మల అన్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు పొంతన లేకుండా సమాధానం ఇచ్చారని మండిపడ్డారు. సెక్రటేరియట్ లో కాళేశ్వరం వ్యవహారంపై మట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. ఈ అంశంపై త్వరలోనే కమిషన్ కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించినది సబ్ కమిటీ కాదని.. అది రాష్ట్రంలో అప్పట్లో  పెండింగ్ ప్రాజెక్టుల మీద  వేసిన సబ్ కమిటీ మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణాల్లో సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు చేయలేదని అన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ అనుమతించింది అనేది వాస్తవం కాదని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు క్యాబినెట్ అప్రూవల్ కు రాలేదని.. ఈ విషయంలో ఈటల ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారని మండిపడ్డారు. సబ్ కమిటీ కి.. కాళేశ్వరం నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదు ఈ సందర్బంగా వివరణ ఇచ్చారు. ఈటల కు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏమొచ్చిందోనని అన్నారు. 

తనను అనవసరంగా కమిషన్ ముందుకు లాగే దురాలోచన మంచిది కాదని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల అన్నారు. 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా తెలిసి తప్పు చేయలేదని.. కానీ కమిషన్ కు ఈటల ఇచ్చిన సమాచారం చూశాక  బాధ వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తప్పుడు సమాచారం ఇచిన ఈటల పునరాలోసించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. సబ్ కమిటీ రిపోర్ట్, కమిటీ ఏం చేసింది అనేది కమిషన్ కు త్వరలోనే అన్ని వివరాలు ఇస్తానని.. త్వరలోనే కమిషన్ కు లేఖ రాస్తానని చెప్పారు. 

రాజకీయాలు వేరు.. రాష్ట్ర అభివృద్ధి వేరని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన వాటినే చేశానని.. అవసరం అనుకుంటే ఆధారాలతో సహా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కాళేశ్వరం విషయంలో హరీష్ రావు ఇంకా అబద్ధాలు ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.