సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు ఓటీటీలో రిలీజైనా మంచి విజయం సాధించాయి. ఈసారి మాత్రం థియేటర్లోనే హిట్టు కొడతానంటున్నాడు సూర్య. అతను హీరోగా పాండిరాజ్ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఎదర్కుమ్ తుణీందవన్’ (ఈటీ) మార్చి 10న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతోంది. తెలుగు రైట్స్ను ఏషియన్ సినిమాస్ సంస్థ సొంతం చేసుకుంది. టాలీవుడ్లో సూర్యకు ఉన్న మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా హక్కుల్ని ఫ్యాన్సీ రేట్కి తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. తెలుగులో తన పాత్రకి సూర్య స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.
మరిన్ని వార్తల కోసం..