ఒకరిపై ఒకరు తుపాకులు ఎక్కు పెట్టారు... ఇదేం డబుల్ ఇంజిన్ సర్కార్...? అఖిలేష్ యాదవ్ 

ఒకరిపై ఒకరు తుపాకులు ఎక్కు పెట్టారు... ఇదేం డబుల్ ఇంజిన్ సర్కార్...? అఖిలేష్ యాదవ్ 

యూపీ పోలీసులపై, ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ సర్కార్ పై ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ( ITBP ) కి  నమ్మకం లేదంటూ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ యాదవ్. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం, దాని పోలీసు బలగాలు చేస్తున్న అన్యాయాలను, దురాగతాలను చూసి ఐటీబీపీ కూడా వారిపై నమ్మకం కోల్పోయిందని ట్వీట్ లో పేర్కొన్నారు అఖిలేష్ యాదవ్.ఒకరిపై ఒకరు తుపాకులు ఎక్కుపెట్టుకుని నిలబడే ఇది ఎలాంటి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటూ ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్.

ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన వైద్య నిర్లక్ష్యం కారణంగా ఐటీబీపీ జవాన్ తల్లి చేయిని తొలగించాల్సి వచ్చిన కేసులో చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఐటీబీపీ అధికారులు శనివారం కాన్పూర్ పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఐటీబీపీ జవాన్ తల్లి చేయిని తొలగించాల్సి వచ్చిన కేసులో చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఐటీబీపీ అధికారులు శనివారం ( మే 23 ) కాన్పూర్ పోలీస్ కమిషనర్‌ను కలిశారు.

కమిషనరేట్ దగ్గర సాయుధ బలగాలు, ఐటీబీపీ జవాన్లు పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని "చుట్టుముట్టారంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ ఈమేరకు ట్వీట్ చేశారు అఖిలేష్ యాదవ్.

►ALSO READ | పదేళ్ల పాపపై అంత అమానుషం జరిగితే నవ్వెలా వస్తుందో.. పైగా పడిపడి నవ్వడం.. IG రమ్య భారతి వీడియో వైరల్ !