ప్రతీ బలిదానం కాంగ్రెస్ చేసిన హత్యే : కవిత

ప్రతీ బలిదానం కాంగ్రెస్ చేసిన హత్యే : కవిత

తెలంగాణ కోసం జరిగిన ప్రతీ బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారన్నారు. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ ,దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణ రాష్ట్రం తెచ్చారని కవిత అన్నారు. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక మీ నాయకుడు రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రం వాయనాడ్ వెళ్లారని ఆరోపించారు. ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో మీ  పార్టీ పైనే ఎమ్మెల్సీ కి పోటీ చేసి గెలిచానని రాసుకొచ్చారు.