స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ దగ్గర దిశ యాప్

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ దగ్గర దిశ యాప్

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ దగ్గర దిశ యాప్ ఉండాలన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఈ యాప్ ను 17 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఫోన్ లో దిశ యాప్ ఉంటే ఒక అన్నో, తమ్ముడో తోడుగా ఉన్నట్టేనని చెప్పారు. దిశ యాప్... మహిళలను ఆపదలో ఉన్నప్పుడు కాపాడే నేస్తం లాంటిదన్నారు. విజయవాడ గొల్లపూడిలో దిశ మొబైల్ అవగాహన కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సమయంలో..వాలంటీర్లు.. దిశా యాప్ లైవ్ డెమో చేసి చూపించారు. యాప్ నుంచి సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు కొద్దిసేపట్లో  స్పాట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్... పోలీసులు మహిళా భద్రతపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.