అందరూ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించండి : రాష్ట్రపతి ముర్ము

అందరూ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించండి : రాష్ట్రపతి ముర్ము

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, సీఎస్ శాంతి కుమారి, హోంమంత్రి మహమ్మద్ అలీ పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఉత్సవాల్లో వర్చువల్ గా పాల్గొని.. రాష్ట్ర పతి నిలయంలోని  నాలెడ్జి గ్యాలెరీ, కిచెన్ టన్నెల్ ను ప్రారంభించారు. వాటితో పాటు విజిటర్ ఫెసిలిటీస్ సెంటర్స్, పలు ఫౌండేషన్ స్టోన్స్, మెట్ల బావులను ప్రారంభించారు. ప్రజల సందర్శనార్థం  రాష్ట్రపతి నిలయాన్ని రేపట్నుంచి అనుమతించే కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టారు. 

కిచెన్ టన్నెల్ ను తెలంగాణ ట్రెడిషనల్ కళతో నిర్మించినం..

గత నెలలో హైదరాబాద్ లోని రాష్ట్ర పతి నిలయంలో బస చేసే అవకాశం దొరికిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర పతి నిలయం చరిత్రకి సంబందించిన పూర్తి విషయాలు నాలేడ్జ్ గ్యాలరీలో లభిస్తాయన్నారు. రినోవెట్ చేసిన కిచెన్ టన్నెల్ ను తెలంగాణ ట్రెడిషనల్ కళతో నిర్మించామన్న ఆమె.. గతంలోనూ రాష్ట్రపతులు వివిధ గార్డెన్స్ ప్రారంభించారని ముర్ము తెలిపారు. ఇప్పుడు తన హయాంలో బట్టర్ ఫ్లై, రాక్, నక్షత గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించండని రాష్ట్రపతి చెప్పారు.

రాష్ట్రపతి నిలయం టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ఒకటిగా నిలుస్తుంది..

దేశ ప్రజలకు గవర్నర్ తమిళి సై ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్రపతి నిలయాన్ని గతంలో ప్రజల సందర్శనకు కేవలం15రోజులు మాత్రమే అనుమతించగా... ఇప్పుడు ఆ సమయాన్ని 11నెలలకు పెంచడంపై రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. కచ్చితంగా రాష్ట్రపతి నిలయం హైదరాబాదులోని టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ఒకటిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు ప్రజలు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తమిళి సై తెలిపారు.

ఈ రకమైన సందర్శనలు చాలా ఉపయోగపడతాయి.. 

దేశ ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి నిలయాన్ని ప్రజలకు11నెలల పాటు సందర్శించే అవకాశం ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అది కూడా ఉగాది పర్వదినాన ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు.  రాష్ట్రపతి నిలయం హెరిటేజ్ బిల్డింగ్ అన్న కిషన్ రెడ్డి... ఢిల్లీ తరహాలో మన హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలోనూ ప్రధాన మంత్రుల ఇన్ఫర్మేషన్  ఉండడం సంతోషమని చెప్పారు. హైదరాబాద్ లో అనేక పర్యాటక కేంద్రాలున్నాయని, అందులో రాష్ట్రపతి నిలయం ఒకటిగా చేరిందని తెలిపారు. రాష్ట్రపతి కార్యకలాపాలు, రాష్ట్ర కార్యకలాపాలు పట్ల అవగాహన కలిగించే విధంగా ఈ రకమైన సందర్శనలు చాలా ఉపయోగపడతాయని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కి విజిట్ చేసే వారు కచ్చితంగా రాష్ట్ర పతి నిలయం సందర్శించాలని కోరారు.