రాహుల్ గాంధీపై రఘురామ్ రాజన్ ప్రశంసలు

రాహుల్ గాంధీపై రఘురామ్ రాజన్ ప్రశంసలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చాలా తెలివైన వ్యక్తి అంటూ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీకి పప్పు అనే  ఇమేజ్ రావడం దురదృష్టకరమని ..ఆయన నిజంగా తెలివైన వ్యక్తని అన్నారు. వరల్డ్ ఎకానమిక్  ఫోరంలో భాగంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘురామ్ రాజన్ ఈ విధంగా స్పందించారు.  దాదాపు 10 ఏళ్ల పాటు వారితో  సన్నిహితంగా ఉన్నానని.. రాహుల్ పప్పు (ఫూల్) కాదని.. ఆయనొక  తెలివైన వ్యక్తి (స్మార్ట్ మేన్), యువ రక్తం కలవాడు, ఆసక్తి కల్గిన వ్యక్తంటూ ప్రశంసించారు. సవాళ్లు  ఏమిటో అన్న విషయంతో పాటు వాటి నష్టాలను అంచనా వేయగల సామర్థ్యం కలిగి ఉండడం చాలా ముఖ్యమని ..రాహుల్ ఆ విషయంలో సమర్థుడని చెప్పారు. 

మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించానని రఘురామ్ రాజన్ అన్నారు. భారత్ జోడో యాత్ర విలువల కోసం కట్టుబడి ఉండడంతోనే ఆ యాత్రలో తాను పాల్గొన్నట్లు చెప్పారు.  గత నెలలో   రాజస్థాన్ లో జరిగిన  జోడోయాత్రలో రఘురామ్ రాజన్ రాహుల్ తో కలిసి నడిచారు.