సికింద్రాబాద్ లో భారీగా ఇతర రాష్ట్రాల మద్యం సీజ్

సికింద్రాబాద్ లో భారీగా ఇతర రాష్ట్రాల మద్యం సీజ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఎక్సైజ్ శాఖ చేపట్టిన నాన్ డ్యూటీ పెయిడ్  లిక్కర్ స్పెషల్ డ్రైవ్ లో  సోమవారం మూడు కేసుల్లో 56 మద్యం బాటిళ్లను పట్టుకుంది. సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ పరిసరాల్లో తిరుమలగిరి ప్రాంతంలో ఎస్​టీఎఫ్ సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతి తనిఖీలు చేసి రమణ అనే వ్యక్తి వద్ద 20 సిగ్నేచర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కేఎస్ఆర్ బెంగళూరు, రాజధాని ఎక్స్​ప్రెస్ లో నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేసి అజయ్ సింగ్  వద్ద 4 కరోనా ఎక్స్ట్రా బీర్లు, 4 మద్యం బాటిళ్లను  సీఐ నాగరాజు సీజ్​ చేశారు. 

మరో ఘటనలో వెస్ట్ మారేడ్​పల్లి ప్రాంతంలో ఎస్ టీ ఎఫ్  ‘బి’ టీం సీఐ భిక్షారెడ్డి, ఎస్సైలు బాలరాజు, సంధ్యా,  టీం లీడర్ ప్రదీప్ రావు దాడులు నిర్వహించారు. రునీత్, ఆదిత్య  ఇంట్లో 13 గ్రాముల ఓజీ  కుష్ గంజాయితో పాటు గోవా, మణిపూర్, ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన 32 లిక్కర్​ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం బాటిళ్ల విలువ రెండున్నర లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.