రైలులో హాషిష్ స్టిక్స్ ​తీసుకెళ్తున్న వ్యక్తిని చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు

రైలులో హాషిష్ స్టిక్స్ ​తీసుకెళ్తున్న వ్యక్తిని చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు

సికింద్రాబాద్, వెలుగు: గంజాయితో తయారు చేసిన హాషిష్ స్టిక్స్​ను తీసుకెళ్తున్న వ్యక్తిని ఎక్సైజ్​స్పెషల్​టాస్క్​ఫోర్స్​  పోలీసులు చేజ్​చేసి పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ.లక్షన్నర విలువైన డ్రగ్స్​స్టిక్స్​ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.  ఎక్సైజ్​ పోలీసులు తెలిపిన మేరకు.. కీసర మండలం రాంపల్లికి చెందిన రిత్విక్(40)  ఉత్తరాఖండ్ కు వెళ్లి  కొంత కాలం ఉండివచ్చాడు. 

జల్సాలకు అలవాటు పడిన అతడు ఈజీ మనీ కోసం గంజాయితో తయారు చేసిన హాషిష్​డ్రగ్స్​స్టిక్స్​ను అమ్మి డబ్బు సంపాదించాలని ప్లాన్​చేశాడు. ఇందులో భాగంగా తన లగేజీతో పాటు ఉత్తరాఖండ్​లో 80 గ్రాముల హాషిష్​  డ్రగ్స్​తీసుకుని రైలులో సికింద్రాబాద్​కు  వచ్చాడు. ముందస్తు సమాచారం మేరకు  అతని కోసం ఎక్సైజ్ఎస్టీఎఫ్ ఇన్​స్పెక్టర్​ ప్రదీప్ రావు టీమ్,​ సికింద్రాబాద్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్ తన సిబ్బంది రైల్వే స్టేషన్​లో నిఘా పెట్టారు. రిత్విక్ రైలు దిగిన వెంటనే పోలీసులను చూసి పారిపోతుండగా చేజ్​చేసి అదుపులోకి తీసుకున్నారు.