ప్రధాని ప్రోగ్రామ్​కు స్పెషల్ ఫ్లైట్​లో ప్రవాసులు

ప్రధాని ప్రోగ్రామ్​కు స్పెషల్ ఫ్లైట్​లో ప్రవాసులు

మెల్​బోర్న్: ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ పెరుగుతోంది. ఆయన ఏ దేశానికి వెళ్లినా, అక్కడున్న ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలుకుతున్నారు. మోడీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మోడీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సిడ్నీలో ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పొరా ఫౌండేషన్ (ఐఏడీఎఫ్) ఆధ్వర్యంలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు.

ఇందులో పాల్గొనేందుకు ఐఏడీఎఫ్ సభ్యులు 170 మంది మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి వెళ్లారు. అయితే వీళ్లంతా ఈ జర్నీ కోసం ఏకంగా స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. దానికి ‘మోడీ ఎయిర్ వేస్’ అని పేరు పెట్టారు. తలకు ట్రైకలర్ టర్బన్లు కట్టుకొని, చేతిలో జాతీయ జెండాలు పట్టుకొని విమానంలో సందడి చేశారు. డ్రమ్స్ వాయిస్తూ డ్యాన్సులు చేశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.