మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై ఎక్స్​పర్ట్స్ మీడియా మీట్​

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై ఎక్స్​పర్ట్స్ మీడియా మీట్​

ఖైరతాబాద్, వెలుగు :  మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంపై న్యాయ విచారణ జరగాలని ప్రముఖ జియాలజిస్టు బీవీ సుబ్బారావు, ఆర్టీఐ మాజీ కమిషనర్​ఆర్.దిలీప్​రెడ్డి, పర్యావరణ వేత్త దొంతి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నాణ్యతల్లోనే లోపం ఉందన్నారు. ఇప్పడు పిల్లర్లకు పగుళ్లు మాత్రమే వచ్చాయి. వచ్చే మరో విపత్తు గురించి కూడా ఆలోచించాలన్నారు.

‘‘మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు: తెలంగాణ మీద భారం’’ అనే అంశంపై గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా మీట్​లో వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విషయాలను రాష్ట్ర, కేంద్ర స్థాయిలో బహిర్గతం చేసి పబ్లిక్ డొమైన్​లో పెట్టి ప్రజల ముందుంచాలి. ఈ ప్రాజెక్టులో వివిధ స్థాయిలలో ఉన్న నిర్ణేతలు, పర్యవేక్షకులకు పూర్తి బాధ్యత ఉంటుంది. ఆ విధంగానే దర్యాప్తు సంస్థలు, మీడియా, ప్రజలు భావించాలన్నారు. దీనిపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరగాలన్నారు.