మీ సేవల్లో దోపిడీపై వివరణ ఇవ్వండి : కిషన్ రెడ్డి

మీ సేవల్లో దోపిడీపై వివరణ ఇవ్వండి : కిషన్ రెడ్డి

కమిషనర్​కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర సేవలకు మీ సేవ కేంద్రాల్లో.. రైతులు, ఇతర జనాల నుంచి అదనంగా డబ్బులు దండుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దీనిపై మీ సేవ కమిషనర్​ను వివరణ అడిగారు. ఈ ఆరోపణలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కమిషనర్​ను మంత్రి కార్యాలయం గురువారం ఆదేశించింది.