కమిషనర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర సేవలకు మీ సేవ కేంద్రాల్లో.. రైతులు, ఇతర జనాల నుంచి అదనంగా డబ్బులు దండుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దీనిపై మీ సేవ కమిషనర్ను వివరణ అడిగారు. ఈ ఆరోపణలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కమిషనర్ను మంత్రి కార్యాలయం గురువారం ఆదేశించింది.