కాశ్మీర్‌ నౌగామ్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

కాశ్మీర్‌ నౌగామ్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

జమ్మూకాశ్మీర్​ లో అర్థరాత్రి పేలుడు జరిగింది. శనివారం(నవంబర్​ 15) తెల్లవారు జామున నౌగామ్​ పోలీస్​ స్టేషన్​ లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో  ఏడుగురు చనిపోయారు. 27 మంది గాయపడ్డారు. పేలుడు దాటికి పలు వాహనాలు కూడా ధ్వంసం అయినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

టెర్రిరిస్టు లనుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరిశీలిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ఎక్కువ మంది పోలీసులు, ఫోరెన్సిక్​ బృందం అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. 

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలో పేలుడు జరిగిన నాలుగు రోజుల తర్వాత జమ్మూలో పేలుడు కలకలం రేపుతోంది.