గ్రూప్1 దరఖాస్తు గడువు పెంపు

గ్రూప్1 దరఖాస్తు గడువు పెంపు
  • ఈ నెల 16 వరకూ అప్లైకి చాన్స్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 దరఖాస్తు గడువును టీఎస్​పీఎస్సీ పొడిగించింది. గురువారం సాయంత్రం 5గంటలతో  గడువు ముగియగా, ఈ నెల16న సాయంత్రం 5గంటల వరకూ అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. గ్రూప్1కు బుధవారం సాయంత్రం వరకూ 2.7లక్షల మంది అప్లై చేసుకున్నారు. అయితే, గురువారం చివరి రోజు కావడంతో భారీగా అభ్యర్థులు అప్లై చేయడానికి ప్రయత్నించారు.

దీంతో టీఎస్ పీఎస్సీ సర్వర్ స్లో అయ్యి వారు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో గడువు పెంచాలని విజ్ఞప్తులు వచ్చాయి.ఈ నేపథ్యంలో రెండురోజుల పాటు దరఖాస్తు గడువు పెంచుతూ టీఎస్ పీఎస్సీ నిర్ణయం తీసుకున్నది. కాగా, 563 గ్రూప్1 పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.