ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరిట ఫేక్ అకౌంట్స్​

ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరిట ఫేక్ అకౌంట్స్​
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

బషీర్ బాగ్, వెలుగు:  రాష్ట్ర ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ అయింది. దీంతో  ఏసీబీ అధికారులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీవీ ఆనంద్ పేరుతో ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్​ లలో ఆగంతకులు ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా అకౌంట్​ల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ లను పంపించినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి పేర్కొన్నారు.