- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ అయింది. దీంతో ఏసీబీ అధికారులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీవీ ఆనంద్ పేరుతో ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లలో ఆగంతకులు ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా అకౌంట్ల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ లను పంపించినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి పేర్కొన్నారు.