
దేశవ్యాప్తంగా లోన్ యాప్స్ తో 500 కోట్లు వసూలు చేసిన ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 22 మంది సభ్యుల ముఠా మొత్తం వందకు పైగా లోన్ యాప్స్ ను నిర్విస్తున్నట్లు గుర్తించారు. ఈ రాకెట్ ను చైనీయులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వినియోగదారుల ప్రైవసీ డేటాను సేకరించి చైనా, హాంకాంగ్ సర్వర్ లో అప్ లోడ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఢిల్లి పోలీసులు సుమారు 2 నెలల పాటు నిఘా పెట్టి.. నిందితులను అరెస్టు చేశారు.
ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లకు ఈ నెట్ వర్క్ విస్తరించింది. చెల్లింపులు చేసిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీలు, హవాలా మార్గంలో చైనాకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోజుకు కనీసం కోటి రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అరెస్టైన నిందితుల నుంచి 51 ఫోన్లు, 25 హార్డ్ డిస్క్ లు, 9 ల్యాప్ టాప్ లు, 19 డెబిట్, క్రెడిట్ కార్డులు, 3 కార్లు, 4 లక్షల నగదును ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.