
బషీర్బాగ్, వెలుగు: బ్రాండెడ్ కంపెనీ పేరిట నకిలీ ప్రొడక్టులు విక్రయిస్తున్న పలు ఎలక్ట్రిక్ షాపులపై ఇంటలెక్చువల్ ప్రొడక్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్టివ్ సర్వీసెస్ హైదరాబాద్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ కోఠి ట్రూప్ బజార్ లో స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులతో కలిసి సర్వీసెస్ రీజినల్ డైరెక్టర్ నాగేశ్వర్ ఈ సోదాల్లో పాల్గొన్నారు.
గోల్డ్ మెడల్ కంపెనీ పేరుతో నకిలీ వైర్లు , స్విచ్ లు , రెగ్యులేటర్ లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో సదరు కంపెనీ ప్రతినిధులు ఇంటలెక్చువల్ ప్రొడక్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్టివ్ సర్వీసెస్ కు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం సోదాలు నిర్వహించగా రెండు షాపులలో రూ.4 లక్షలు విలువ చేసే నకిలీ ప్రొడక్టులు దొరికాయి. వాటిని అధికారులు సీజ్ చేశారు. ప్రజలు నకిలీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.