నంబాల మృతదేహం కోసం కుటుంబీకుల ఆందోళన

నంబాల మృతదేహం కోసం కుటుంబీకుల ఆందోళన

 

  • హైకోర్టు ఆర్డర్ ఉన్న డెడ్ బాడీ ఇవ్వట్లేదు
  • కేశవరావు, మధు, లలిత  ఫ్యామిలీ మెంబర్స్
  • చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో ఆందోళన
  • నాలుగు రోజులుగా ఆస్పత్రి వద్ద పడిగాపులు


హైదరాబాద్:  అబూజ్ మడ్ అడవుల్లో ఎన్ కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు డెడ్ బాడీని పోలీసులు ఇంతవరకు అప్పగించలేదు. మృతదేహాల కోసం చత్తీస్ గఢ్ వెళ్లి న కుటుంబ సభ్యులకు పోలీసులు ఇంకా డెడ్ బాడీలు అప్పగించలేదు.  మామూలుగా ఎక్కడ ఎన్ కౌంటర్లు జరిగినా పోలీసులు పోస్టుమార్టమ్ జరిపించిన తర్వాత కుటుంబసభ్యులను పిలిపించి వాళ్ళ మృతదేహాలను అప్పగించేస్తారు. 

మావోయిస్టు కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబాల మృతదేహాన్ని అప్పగించే విషయంలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా  పోలీసులు ఇవ్వడం లేదు.  కోర్ట్ ఆర్డర్ కాపీతోపాటు కావాల్సిన పత్రాలు, తమ ఆధార్ కార్డులు ఇచ్చినా తమకు డెడ్ బాడీలు అప్పగించడం లేదని నంబాల కేశవరావు, లలిత, మధు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఆస్పత్రికి వెళ్తే.. పోలీసుల వద్దకు వెళ్లమని చెబుతున్నారని అన్నారు. పోలీసులను అడిగితే వాళ్ల కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలు కావాలని అంటున్నారని, యాభై ఏండ్ల కింద ఇంట్లోంచి వెళ్లిపోయిన వాళ్ల ఫొటోలు ఇప్పుడు ఎలా తేగలమని ఆవేదన వ్యక్తం చేశారు.