అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

పెద్దమందడి, వెలుగు: అప్పుల బాధతో వనపర్తి జిల్లా పెద్దమందడికి చెందిన రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన గొల్ల మన్నెంకొండ(50) తన ఐదెకరాల పొలంలో 3 బోర్లు వేయడానికి, వరి, వేరుశనగ పంటల పెట్టుబడికి రూ.5 లక్షలు అప్పు చేశాడు. ఆశించినంతగా పంటలు పండకపోవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెంది ఈ నెల 20న పురుగు మందు తాగాడు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో కుటుంబసభ్యులు అతన్ని మహబూబ్‌ నగర్ జిల్లా హాస్పిటల్​కు తీసుకెళ్లారు. వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.