మెదక్ జిల్లా : కరెంట్ షాక్ తో ఓ రైతు చనిపోయిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. అడవి పందుల నుంచి పంట పొలాలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగలడంతో మరణించాడని తెలిపారు గ్రామస్థులు. మెదక్ జిల్లాలోని రామాయంపేటకు చెందిన రైతు రెడ్డి మైన రాములు(30) ఆదివారం రాత్రి పంట పొలాల కాపలా కోసం వెళ్లాడు.
అయితే పంట పొలానికి రక్షణ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలపై రాములు కాలు పెట్టడంతో.. విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. పొలం వద్దకు వెళ్లి రాములు మృతదేహాన్ని చూసి కంటతడిపెట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.