ట్రాక్టర్​ బోల్తా పడి రైతు మృతి

ట్రాక్టర్​ బోల్తా పడి రైతు మృతి

పెగడపల్లి, వెలుగు : జగిత్యాల జిల్లాలో పొలం దున్నుతుండగా ట్రాక్టర్​బోల్తా పడి రైతు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన సిలివేరు తిరుపతి(43) సోమవారం ఉదయం ట్రాక్టర్​తీసుకుని తన పొలం వద్దకు వెళ్లాడు.

పొలం దున్నుతూ.. గట్టు ఎక్కించే ప్రయత్నంలో ట్రాక్టర్​బోల్తా పడగా, దాని కింద తిరుపతి పడిపోయాడు. దీంతో అతని తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి రైతులు కరీంనగర్‌‌‌‌ హాస్పిటల్‌‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య అంజలి ఫిర్యాదు తో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్​తెలిపారు.