
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరియి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి తరలించినా సల్మాన్ ఖాన్ కి భెదిరింపులు మాత్రం తగ్గడం లేదు. ఆమధ్య సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ లారెన్స్ బిష్ణోయ్ ఖరాబ్ ఆద్మీ (చెడ్డవాడు) అని సంభోదించాడు. దీంతో వీరివురి మధ్య విభేదాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి.
ఇటీవలే ఈ విషయంపై రైతు సంఘం నాయకుడు రాకేష్ టికైత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా ఓ వీడియోలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ సామజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే ఈ గొడవ మరింత పెద్దదవుతుందని అన్నారు.
ALSO READ | స్టార్ హీరోకి జైలులో వీఐపీ ట్రీట్మెంట్.. ట్రావెల్ ఏజెన్సీ ఓనర్ అరెస్ట్..
అలాగే లారెన్స్ బిష్ణోయ్ సామాజికవర్గానికి చెందిన ఆలయాన్ని సందర్శించి దర్శించుకోవాలని ఇలా చెయ్యడం వలన గతంలో సల్మాన్ ఖాన్ చేసిన పనిని వారు క్షమిస్తారని అభిప్రాయ పడ్డాడు. అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఎదుర్కొంటున్నది కేవలం లారెన్స్ బిష్ణోయ్ ని కాదని కాబట్టి సమస్య ఎటువైపు నుంచి వస్తుందో అంచనా వెయ్యడం కష్టమని కాబట్టి బహిరంగంగా క్షమాపణలు చెప్పడంవలన ముప్పు తగ్గుతుందని సూచించారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హిందీ 18వ సీజన్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్ట్ చేస్తున్న సికిందర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఎదుర్కుంటుండటంతో భారీ భద్రాతా ఏర్పాట్ల నడుమ షూటింగులలో పాల్గొంటున్నాడు.