
కన్నడ ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప రేణుకా స్వామి హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే దర్శన్ కి జైలులో వీఐపి ట్రీట్మెంట్ అందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో దర్శన్ జైలులో కాఫీ తాగుతూ స్మోక్ చేస్తూ తోటి ఖైదీలతో జాలీగా గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దర్శన్ పై నిఘా ఉంచిన పోలీసులు దర్శన్ తో పాటు అదే జైలులో ఖైదీగా ఉన్న ధర్మ అనే వ్యక్తి ద్వారా సెల్ఫోన్ తో పాటూ ఛార్జర్ వంటివి అందినట్లు పోలీసులు కనుగున్నారు.
దీంతో ధర్మ ని అదుపులోకి తీసుకుని విచారించగా ట్రావెల్ ఏజెన్సీ యజమాని మాణికణ్ణన్ అనే వ్యక్తి ధర్మ కి సెల్ఫోన్ సిమ్ కార్డు ని అందించగా ధర్మ ద్వారా దర్శన్ తరచుగా సెల్ఫోన్ ఉపయోగించేవాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే కొన్ని రోజుల క్రితం దర్శన్ జాలీగా గడుపుతున్న ఫోటోలు బయటికి రావడంతో సెల్ఫోన్ తోపాటూ సిమ్ కార్డుని పగలగొట్టి బాత్ రూమ్ లో పడేసినట్లు మాణికణ్ణన్ పోలీసుల విచారణలో చెప్పాడు. దీంతో ట్రావెల్ ఏజెన్సీ యజమాని మాణికణ్ణన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ALSO READ | నెపోటిజంపై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..
ఈ విషయం ఇలా ఉండగా దర్శన్ తోపాటూ రేణుకా స్వామి హత్య కేసులో ఇప్పటివరకూ దాదాపుగా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ క్రమంలో ముగ్గురికి బెయిల్ మంజారు కాగా దర్శన్, పవిత్ర గౌడ తదితరులతోపాటూ మరో 12 మంది జైలు జీవితం గడుపుతున్నారు.