
సలార్ సినిమాలో రెండో హీరోగా నటించిన మలయాళీ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పృథ్వీరాజ్ హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలో తెలుగు సినిమాల్లో నటించాడు. కానీ క్రమక్రమంగా మలయాళీ భాషలో ఆఫర్లు ఎక్కువగా రావడంతో కేరళ సినీ ఇండస్ట్రీకి పరిమితం అయ్యాడు.
అయితే ఇటీవలే పృథ్వీరాజ్ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతీ రంగంలో కూడా నెపోటిజం ఉంటుందని తెలిపాడు. ఇక తన తండ్రి అప్పట్లోనే స్టార్ నటుడు కావడంతో తన ఫస్ట్ సినిమాకి తాను స్క్రీన్ టెస్ట్ లో పాల్గొనలేదని డైరెక్ట్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చానని చెప్పుకొచ్చాడు. అయితే తాను ఇండస్ట్రీలోకి రావడానికి తన ఇంటిపేరు ఉపయోగపడిందని కానీ తన ప్రతిభవల్లే ఇన్ని రోజులు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నానని అన్నారు.
అలాగే సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ లేకపోతే ఎంత గొప్ప ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా కెరీర్ ఉండదని అందులో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీలో శుక్రవారం రోజున నటీనటుల టాలెంట్ కి మార్కులు పడతాయని దీంతో ఒక్క శుక్రవారంతో ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల కెరీర్ డిసైడ్ అవుతుందని చెప్పుకొచ్చాడు.
ఈ విషయం ఇలా ఉండగా పృథ్వీరాజ్ తన విలక్షణమైన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే పృథ్వీరాజ్నటించిన ఆడుజీవితం సినిమా వరల్డ్ వైడ్ గా మంచి హిట్ అయ్యింది. అంతేగాకుండా ఈ చిత్రంలో పృథ్వీరాజ్ నటనకి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంశలు అందాయి. కాగా ప్రస్తుతం పృథ్వీరాజ్తెలుగులో ప్రముఖ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు.