- మంచిర్యాలలో దళిత రైతుపై దౌర్జన్యం
- నిందితుడిపైఅట్రాసిటీ కేసు
చెన్నూర్, వెలుగు : మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. చేనులో ఎడ్లు పడ్డయని, ఓ దళిత రైతును కులం పేరుతో తిడుతూ కట్టేసి కొట్టారు. కోటపల్లి మండలం శెట్పల్లికి చెందిన దుర్గం బాపు ఎడ్లు.. గురువారం అదే గ్రామానికి చెందిన సూరం రాంరెడ్డి చేనులో పడ్డాయి. ఎడ్లు పంట మేశాయని ఆగ్రహించిన రాంరెడ్డి.. దుర్గం బాపు ఇంటికెళ్లి అతడిని కులం పేరుతో తిట్టాడు.
బాపును ఈడ్చుకుంటూ తన ఇంటి దాకా తీసుకొచ్చాడు. అతడిని తన ఇంటి ముందున్న కొయ్యకు కట్టేసి కొట్టాడు. బాధితుడు బాపు ఫిర్యాదు మేరకు రాంరెడ్డిపై అట్రాసిటీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటపల్లి ఎస్సై సురేశ్ తెలిపారు.