రూ. లక్ష లోన్ కు రూ. 50 వేలు తీసుకున్నడు .. డీఎస్ ఓ కు ఫిర్యాదు చేసిన బాధిత రైతులు

రూ. లక్ష లోన్ కు రూ. 50 వేలు తీసుకున్నడు .. డీఎస్ ఓ కు ఫిర్యాదు చేసిన బాధిత రైతులు
  • ఖమ్మం జిల్లా ఏదులాపురం సొసైటీ పీఏసీఎస్ చైర్మన్ అక్రమాలు 

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లా ఏదులాపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అక్రమాలు జరిగాయి.  పీఏసీఎస్ చైర్మన్ జర్పుల లక్ష్మణ్ నాయక్ ఏజెంట్లను నియమించుకుని డబ్బులు వసూలు చేస్తున్నాడని రైతులు ఆరోపించారు. రుణమాఫీ వస్తుందని, ఇచ్చిన లోను డబ్బులు సగం బలవంతంగా తీసుకున్నాడని వాపోయారు.  రూ. లక్ష రుణానికి రూ.50 వేల చొప్పున తీసుకున్నాడని శనివారం డీఎస్ ఓ గంగాధర్ కు రైతులు ఫిర్యాదు చేశారు. ఖమ్మం రూరల్ మండలం గుండాల తండా గ్రామానికి చెందిన రైతు తేజావత్ బాలు, భూక్యా వీరన్న మాట్లాడుతూ.. తమ డబ్బులు ఇప్పించాలని, చైర్మన్ జర్పుల లక్ష్మణ్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. 

రుణమాఫీ కాకపోవడంతో రైతులంతా లక్ష్మణ్ నాయక్ ను నిలదీయడంతో తనకు సంబంధం లేదని లోన్ అమౌంట్ చెల్లించాలని  బెదిరించాడని తెలిపారు. తమ పేరుపై లోన్ ఉండటంతో రైతులు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయని ఆందోళన చెందారు. ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం, ముత్తగూడెం, ఎం వెంకటాయపాలెం, గుడిమల్ల, వెంకటగిరి, గుండాలతండా, కస్నతండా, కామచికల్లు, గుర్రలపాడు, మంగళగూడ్, పోలేపల్లి, దారేడు, తీర్థాల, తనగపాడు గ్రామాల్లో సుమారు 300 వందల మంది రైతులు నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతుల నుంచి కోట్ల డబ్బులు దండుకున్నాడని, ఉన్నతాధికారులు అధికారులు విచారించి పీఏసీఎస్  చైర్మన్ లక్ష్మణ్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.