పంటలు కాపాడాలని రైతుల ధర్నా

పంటలు కాపాడాలని రైతుల ధర్నా

ఊట్కూర్, వెలుగు: పొలాల్లో వేసిన పంటలను జింకల బారి నుంచి కాపాడాలని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మండల కేంద్రంలోని చెక్ పోస్ట్  దగ్గర రైతులు రాస్తా రోకో చేయగా, విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్ తిరుపతయ్య అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అప్పులు చేసి సాగు చేస్తున్న పత్తి,కంది పంటలను జింకలు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దంతన్ పల్లి, కొల్లూరు, లక్ష్మీపల్లి గ్రామ శివారుల్లో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వాపోయారు. 

Aslo Read :- రోడ్డు కోసం ఎమ్మెల్యే నిలదీత : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం అందజేసి సమస్య తీవ్రతను వివరించారు. రైతులు విగ్నేశ్వర్ రెడ్డి, సుప్ప నర్సిరెడ్డి, కుర్వ రామప్ప, ఎంపీటీసీ దొబ్బలి హన్మంతు, లక్ష్మప్ప, వెంకటస్వామి, మోనపోల వెంకటప్ప, వడ్డే చిన్న పాల్గొన్నారు.