పిట్లం, వెలుగు: అకాల వర్షాలతో తడిసి, రంగుమారిన జొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని సోమవారం పిట్లం అంబేద్కర్చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. 2 నెలల కింద వడ్లు కొనుగోలు చేసినా, ఇప్పటి వరకు చాల మంది అకౌంట్లలో డబ్బులు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎకరాకు రూ.10 వేలు అందించాలని డిమాండ్చేశారు.
ఆందోళన చేస్తున్న వారికి బీజేపీ జిల్లా ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ అశోక్రాజ్, టౌన్ ప్రెసిడెంట్ శివకుమార్మద్దతు పలికారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్నిలిచిపోయింది. పోలీసులు ఆందోళన స్థలికి చేరుకొని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు.