రంగుమారిన జొన్నలు కొనాలని రైతుల ధర్నా

రంగుమారిన జొన్నలు కొనాలని రైతుల ధర్నా

పిట్లం, వెలుగు: అకాల వర్షాలతో తడిసి, రంగుమారిన జొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని సోమవారం పిట్లం అంబేద్కర్​చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. 2 నెలల కింద వడ్లు కొనుగోలు చేసినా, ఇప్పటి వరకు చాల మంది అకౌంట్లలో డబ్బులు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎకరాకు రూ.10 వేలు అందించాలని డిమాండ్​చేశారు. 

ఆందోళన చేస్తున్న వారికి బీజేపీ జిల్లా ఓబీసీ వైస్​ ప్రెసిడెంట్ అశోక్​రాజ్, టౌన్ ​ప్రెసిడెంట్ శివకుమార్​మద్దతు పలికారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్​నిలిచిపోయింది.  పోలీసులు ఆందోళన స్థలికి చేరుకొని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు.