నాగలే కాదు.. బ్యాటూ పడ్తం క్రికెట్​ ఆడిన రైతులు

 నాగలే కాదు.. బ్యాటూ పడ్తం క్రికెట్​ ఆడిన రైతులు

వ్యవసాయ పనులు పక్కన పెట్టి రైతులంతా కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. నిర్మల్​జిల్లా భైంసా మండలం కథ్​గామ్​లోని తపోవన్​ స్కూల్​గ్రౌండ్​ ఇందుకు వేదికైంది. 24 మంది రైతులు భారత్, లగాన్​ జట్లుగా విడిపోయి తలపడ్డారు. 

దోతులు, లుంగీలు కట్టుకుని బ్యాటింగ్ చేయడం, బాల్​ కోసం పరుగెత్తడం, బౌలింగ్ చేయడం ఆకట్టుకుంది. నిత్యం పొలం పనుల్లో అలసిపోయే రైతులు.. ఇట్ల పొద్దంతా గ్రౌండ్​లోనే గడిపి రిలాక్స్​ అయ్యారు. వీళ్ల ఆట చూసేందుకు ఊరి జనం కూడా భారీగానే తరలివచ్చారు. చివరకు భారత్​ జట్టు గెలవడంతో సర్పంచ్​ రాజు సిల్వర్​ ట్రోఫీ అందజేశారు. - భైంసా, వెలుగు