వడగండ్ల వానతో అన్నదాత పరేషాన్​

వడగండ్ల వానతో అన్నదాత పరేషాన్​

నెట్​వర్క్,​ వెలుగు : ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం అకాల వర్షాలతో వడగండ్లు పడ్డాయి. దీంతో వరి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మరో రెండు వారాల్లో కోతలు షురూ కానుండగా అకాల వర్షాలు వరిపంటను దెబ్బతీశాయి. నిజామాబాద్​జిల్లాలోని సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో సుమారు 40 నిమిషాల పాటు వర్షం కురిసింది. ఆర్మూర్, మోపాల్​ మండలాల్లో చినుకులు పడ్డాయి. నిజామాబాద్​లో సుమారు గంటపాటు కరెంట్​సరఫరా నిలిచిపోయింది.

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ఈదురు గాలులకు  చిన్నచిన్న చెట్లు పడిపోయాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు ఏరియాల్లో కరెంట్​సప్లయ్ ​నిలిచిపోయింది. వడగళ్లతో పంట నష్టం జరిగినట్లు రైతుల నుంచి సమాచారం అందుకున్న రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్ ​భూపతిరెడ్డి అగ్రికల్చర్​ ఆఫీసర్లతో ఫోన్​లో మాట్లాడారు

ఆదివారం క్షేత్రస్థాయిలో విజిట్​చేసి నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. తాను కూడా వడగండ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తానన్నారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.