
గన్నేరువరం, వెలుగు: విద్యుత్ సమస్య తీర్చాలని గన్నేరువరం మండలంలోని కునవానిపల్లె రైతులు శుక్రవారం కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కునవానిపల్లెలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పోల్ విరిగిపోయి 11 కేవీ వైర్లు ఒకదానిపై ఒకటి పడి వ్యవసాయ మోటార్లు కాలిపోయి నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని వాపోయారు. స్థానిక రైతులు బోయిని బాలయ్య, కున రవి, యాదగిరి, రాజు, మురళి, లచ్చయ్య ,సంపత్ , విజేందర్, కూన చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు.