జగిత్యాల జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ హైవేపై రైతులు ఆందోళనకు దిగారు. వెల్గటూర్ మండలం పాశీగామ రైతులు రోడ్డు పై బస్తాలు వేసి మొలకెత్తిన ధాన్యం పోసి నిరసన తెలిపారు.రోడ్డుపై బైఠాయించడంతో కరీంనగర్ మంచిర్యాల హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని రెండు నెలలు అవుతున్నా ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. గత మూడు రోజుల క్రితమే తిమ్మ పూర్ సొసైటీ ముందు నిరసన తెలిపిన రైతులు మళ్ళీ ఇవాళ రోడ్డు పై బైఠాయించారు. ఇథనాల్ ప్రాజెక్టు రద్దు కోసం ఆందోళనలు చేసినందుకే కక్ష కట్టి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఎమ్మార్వోతో రైతులు వాగ్వాదానికి దిగారు.