మెదక్ జిల్లాలో రైతుల ఆందోళన

మెదక్ జిల్లాలో రైతుల ఆందోళన

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కాలాన్ శెట్టిలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయొద్దంటూ PACS ఛైర్మన్ అనంతరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. కాలాన్ శెట్టి పల్లిలో ధాన్యం కొనుగులు చేయకపోగా ... ఇతర కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ధాన్యం తీసుకోవద్దని ఆదేశించారు అనంత రెడ్డి. దీంతో PACS ఛైర్మన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం ఎందుకు కొనడం లేదంటూ నిలదీశారు. అయితే నిరసన తెలుపుతున్న రైతులపై మండిపడ్డారు అనంత రెడ్డి. ఏం చేసుకుంటారో చేసుకోవాలన్నారు. మేము కొన్నప్పుడే... రైతులు ధాన్యం అమ్ముకోవాలన్నారు.