
వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కామారెడ్డి మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగారు రైతులు. నాలుగు రోజులుగా సంచుల కొరత పేరుతో సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యార్డులో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ…ధర్నాకు దిగారు. వెంటనే ధన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే పట్టణ సీఐ…రైతులకు సర్ధిచెప్పి సముదాయించడంతో ధర్నాను విరిమింపచేశారు.