కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ లో దారుణం జరిగింది. కన్న తండ్రే కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామానికి చెందిన పిట్ల నర్సింలు(43) కూతురు(19) పైనే గత కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తూ.. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడు.
బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఒకటిన్నర నెలల గర్భవతి.
See more news