ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగురవేసిన్రు.. తండ్రీకొడుకుల అరెస్ట్

ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగురవేసిన్రు.. తండ్రీకొడుకుల అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ నివాసంలో పాకిస్థాన్ జెండాను ఎగురవేసిన ఘటన పెను వివాదానికి దారితీసింది. ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగురవేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసులు ఆ ఇంటి నుంచి పాకిస్థాన్ జెండాను తొలగించి దేశద్రోహ నేరం కింద తండ్రీకొడుకులిద్దరినీ అరెస్ట్ చేశారు.

తండ్రీకొడుకుల అరెస్ట్

ఈ ఘటన మొత్తం మురాదాబాద్‌లోని భగత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధన్‌పూర్ అలీగంజ్ గ్రామంలో జరిగింది. టెక్స్‌టైల్ వ్యాపారి రయీస్ ఇంటి వద్ద పాకిస్థాన్ జెండాను ప్రదర్శిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చూడగా అతడి ఇంటి పైకప్పుపై పాకిస్థాన్ జెండా రెపరెపలాడింది. సాక్ష్యాధారాల కోసం పోలీసులు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిర్వహించి ఆ తర్వాత జెండాను తొలగించారు. తదనంతరం, సంఘటనా స్థలంలో రయీస్, అతని కుమారుడు సల్మాన్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

దేశద్రోహం కేసు

నిందితులిద్దరిపై దేశద్రోహ నేరం కింద భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 153ఏ, 153బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణతో పాటు, స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎల్‌ఐయు) కూడా వారిని విచారిస్తోంది. నిందితులిద్దరినీ త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నారు. వారి ఇంటిపై పాకిస్థాన్ జెండాను ఎగురవేయడానికి గల కారణాలపై పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు, అయితే వారు ప్రస్తుతానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.