మత పెద్దల మాటను పట్టించుకోని వారికి జరిమానాలు విధిస్తారు. దీంతో పాటు కఠిన శిక్షలు అమలు పరుస్తారు.ఇందులో బాగంగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీ ఆధిపత్య గ్రామానికి చెందిన అధిపతులు ఫత్వా జారీ చేశారు. క్యారమ్స్ ఆడటం, మద్యం లేదా లాటరీ టిక్కెట్లు కొనడం, అమ్మడం, సెల్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా మ్యూజిక్ వినడం వంటి ఇతర సామాజిక సంస్కరణల కమిటీ రూపొందించిన ఈ ఫత్వా ఆగస్టు 9న జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పడం, గుండు చేయించడం, గుంజిళ్లు తీయించడం వంటి శిక్షలతో పాటు రూ .500 నుంచి రూ .7000 వరకు జరిమానాలు విధించనున్నట్లు ఆ ఫత్వాలో తెలిపారు. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి తెలియజేసేవారికి నేరం స్వభావాన్ని బట్టి 200 నుంచి 2,000 రూపాయల వరకు రివార్డును కూడా కమిటీ ప్రకటించింది.
శిక్షల జాబితా:
..టీవీ చూడటం, సంగీతం వినడానికి మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ ఉపయోగించడం: రూ. 1,000 జరిమానా
..క్యారమ్ బోర్డు ఆడటం: రూ. 500 జరిమానా
..లాటరీ కొనుగోలు: రూ. 2,000 జరిమానా
..మద్యం అమ్మకం: రూ. 7,000తో పాటు గుండు చేసి గ్రామంలో ఊరేగిస్తారు.
..లాటరీ టికెట్లను అమ్మడం: రూ. 7,000 జరిమానా
..మద్యం సేవించడం: రూ. 2,000 జరిమానా, 10 గుంజిళ్లు
..గంజాయి కొనుగోలు: రూ. 7,000 జరిమానా