మానసిక ఒత్తిడి.. మహిళా జడ్జి సూసైడ్​

మానసిక ఒత్తిడి.. మహిళా జడ్జి సూసైడ్​

బదౌన్: బదౌన్ జిల్లా కోర్టు జూనియర్ సివిల్ జడ్జి తన నివాసంలో శనివారం ఉరేసుకుని చనిపోయారు. మానసిక ఒత్తిడికి లోనై ఆమె ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. మౌ జిల్లాకు చెందిన జ్యోతిరాయ్ బదౌన్ జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్నారు. ఇక్కడి జడ్జికాలనీలో నివసిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు కూడా ఆమె కోర్టుకు రాలేదు. 

తోటి జడ్జిలు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో పోలీసులతో సహా వారు ఆమె నివాసానికి చేరుకున్నారు. అక్కడికి  వెళ్లేసరికి బెడ్ రూంకు లోపలి నుంచి గడియపెట్టుంది. ఈ క్రమంలో పోలీసులు బెడ్ రూం డోర్ ను పగులగొట్టి చూడగా పక్క గదిలోని ఫ్యాన్ కు ఆమె ఉరివేసుకుని కనిపించారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఘటన స్థలంలో కొన్ని డాక్యుమెంట్స్ తో సహా సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.