బావతో గొడవ పడి.. మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

బావతో గొడవ పడి.. మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: బావతో గొడవ పడిన ఓ మహిళా సర్పంచ్.. మనస్థాపానికిలోనై ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్దకు సర్పంచ్ అలివేలు, తన భర్త నర్సింలుతో కలిసి వెళ్లింది. అక్కడ నర్పింలుకు వరుసకు అన్న అయ్యే యాదయ్యతో గొడవ జరిగింది. ఈ క్రమంలో యాదయ్య.. అలివేలును కూడా దుర్భాషలాడారు. దాంతో తీవ్ర మనస్థాపం చెందిన అలివేలు.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్‎ను.. ఎంపీడీవో శ్రీనివాస్ పరామర్శించారు. తన బావ అయిన యాదయ్య వేధింపుల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసినట్లు అలివేలు అధికారులకు తెలిపింది. కుటుంబపరంగా, రాజకీయ పరంగా దెబ్బతీసేందుకు యాదయ్య మానసికంగా వేధిస్తున్నట్లు అలివేలు అధికారుల ముందు వాపోయారు.

For More News..

ఈటలను లక్ష మెజార్టీతో గెలిపించాలి: వివేక్ వెంకటస్వామి

వర్షాలతో రూ. 8 వేల కోట్ల పంట నష్టం వస్తే.. కేంద్రం రూ. 8 కూడా ఇవ్వలే: సీఎం కేసీఆర్

కౌలు రైతులను మేం పట్టించుకోం: సీఎం కేసీఆర్

పండుగపూట పెట్రో మంట.. వరుసగా నాలుగో రోజు బాదుడు