కరీంనగర్: లక్ష మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఈటలను గెలిపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి అన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికలో భారీ మెజార్టీతో ఈటలను గెలిపించే బాధ్యత మనదేనని ఆయన అన్నారు. జమ్మికుంటలో మత్స్యకారులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో వివేక్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, బాబు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
‘ఈటల రాజేందర్ మీద ప్రేమతోనే ఈ సమావేశానికి ఇంతమంది వచ్చారు. 2014లో అసెంబ్లీ టికెట్లు ఇస్తున్న సమయంలో మా ముదిరాజ్లను మరిచిపోవద్దని కేసీఆర్ను ఈటల రాజేందర్ కోరారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి వెళ్లే ముందు కూడా ముదిరాజ్ కులస్థుల గురించే మాట్లాడారు. రాష్ట్రంలోని
31 జిల్లాల నుంచి ముదిరాజ్ కులస్తుల ప్రతినిధులను ఈటల ఢిల్లీకి తీసుకెళ్లారు. చింతమడకలో ఇంటికి పదిలక్షలు ఇచ్చినప్పుడు.. ముదిరాజ్ బంధు కూడా ఇవ్వాలని ఈటల కొట్లాడారు. ఈ నెల 30న భారీ మెజార్టీతో ఈటలను గెలిపించే బాధ్యత మనదే. లక్ష మెజార్టీతో ఈటలను మనం గెలిపించాలి’ అని వివేక్ అన్నారు.
For More News..