
పూర్తిగా నయమై ఇంటికిపోయిన చెన్నై వ్యాపారి
లంగ్స్ మార్చాలనుకున్నా.. సెకండ్వేవ్తో దొరకలె
62 రోజుల పాటు ఎక్మోతోనే ఆక్సిజన్ ట్రీట్మెంట్
చెన్నై: ఒకటి కాదు.. రెండు కాదు.. కరోనా సోకి 109 రోజులు వెంటిలేటర్పైనే ఉన్నాడాయన. కావాల్సినంత ఆక్సిజన్ అందుతలేదు. ఊపిరితిత్తులు మార్చాలన్నారు. బతుకుతాడన్న ఆశలూ లేవు. కానీ, అద్భుతమే జరిగింది. లంగ్స్ మంచిగై ఆయన పూర్తిగా కోలుకున్నారు.. ఆనందంగా ఇంటికెళ్లిపోయారు. ఆయన పేరు మహ్మద్ ముద్ధీజా (56). తమిళనాడు బిజినెస్మ్యాన్. దేశంలో ఎక్కువరోజుల పాటు కరోనాకు చికిత్స తీసుకుని బతికిన వ్యక్తి ఆయనేనని డాక్టర్లు చెప్తున్నారు.
నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్
56 ఏండ్ల ముద్ధీజాకు ఏప్రిల్ చివర్లో కరోనా సోకింది. చెన్నైలోని రేలా ఆస్పత్రికి తరలించగా.. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్పై పెట్టినా.. దాని నుంచి వచ్చే ఆక్సిజన్ ఆయనకు చాల్లేదు. నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ అవసరం కావడంతో.. వెంటనే ఎక్మోపై పెట్టారు. 4 వారాల తర్వాత ఊపిరితిత్తులను మార్చాలని డాక్టర్లు సూచించారు. కానీ, ఊపిరితిత్తులు దొరకక ఎక్మోపైనే చికిత్స అందిస్తూ వచ్చారు. ఎక్మోపై పెట్టిన 9వ వారంలో ఆయన ఊపిరితిత్తులు బాగయ్యాయి. ప్రస్తుతం వీల్ చెయిర్కే ఆయన పరిమితమైనా.. ధైర్యంగా ఇంటికెళ్లిపోయారు. ఇది తనకు పునర్జన్మ అని ముద్ధీజా అన్నారు. ఆయన కూతురు ఎంఏ మర్జూకా ఇంటి వద్దే జిమ్ పెట్టించారు. ఒక్క ఎక్మోకే నెలకు రూ.40 లక్షలు ఖర్చు పెట్టామని ఆమె చెప్పారు. ఎంత బిజినెస్ ఉన్నా.. తమకూ అది కొంత ఆర్థిక భారంగానే మారిందని తెలిపారు.