ఈటల రాజేందర్ ను పరామర్శించిన పూనమ్ కౌర్ 

ఈటల రాజేందర్ ను పరామర్శించిన పూనమ్ కౌర్ 

హనుమకొండ జిల్లా కమలపూర్ లో సినీ నటీ పూనమ్ కౌర్ ఈటల రాజేందర్ ను పరామర్శించారు. ఇటీవల ఈటల మల్లయ్య మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఈటల మల్లయ్యకు ఘనంగా నివాళి అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడిన మల్లయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అంత్యక్రియలు కమలాపూర్  లో నిర్వహించారు. మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు,  ఐదుగురు కుమార్తెలు. ఈటల రాజేందర్ రెండో కుమారుడు.