అనురాగ్ కశ్యప్, తాప్సి ఇళ్లల్లో ఐటీ దాడులు

అనురాగ్ కశ్యప్, తాప్సి ఇళ్లల్లో ఐటీ దాడులు

బాలీవుడ్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫిలీం డైరెక్టర్,నిర్మాత అనురాగ్ కశ్యప్, నటి తాప్సి పన్ను ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఇవాళ(బుధవారం) ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, పూణెలోని దాదాపు 20 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. అక్రమంగా సంపాదిస్తున్నారని..ఫిలీం సంస్థకు సంబంధించి పన్ను ఎగవేస్తున్నారనే ఆరోపణలతో ఐటీ అధికారులు సోదాలు చేశారు. వీటితో పాటు నిర్మాత వికాస్ బహల్, మధు మంతేనా ఇళ్లల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. వీరు ముగ్గురు కలిసి ఫాంటమ్ ఫిలీంస్  అనే సంస్థను స్థాపించి పలు సినిమాలను తీశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు కశ్యప్, తాప్సి, వికాస్ బహల్ మద్దతు పలికారు.