కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. నీలం మధు, అద్దంకి దయాకర్కు షాక్..

కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. నీలం మధు, అద్దంకి దయాకర్కు షాక్..

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదలైంది. ఇప్పటికే 114 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. 2023, నవంబర్ 9వ తేదీ గురువారం సాయంత్రం పెండింగ్ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, పటాన్ చెరు స్థానాన్ని ఏఐసీసీ మార్చింది. నీలం మధుకు కేటాయించిన పటాన్ చెరు సీటును.. కట్ట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. అలాగే, తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ కు అదిష్టానం షాకిచ్చింది. ఆ స్థానాన్ని ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మందుల సామ్యూల్ కు కేటాయించారు.

తాజాగా ప్రకటించిన అభ్యర్థులు:

  • సూర్యాపేట: రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
  • పటాన్ చెరు: కట్ట శ్రీనివాస్ గౌడ్
  • మిర్యాలగూడ: బత్తుల లక్ష్మారెడ్డి
  • తుంగతుర్తి: మందుల సామ్యుల్ (ఎస్సీ)
  • చార్మీనార్: మహ్మద్ ముజీబ్ ఉల్ షీర్