న్యూఢిల్లీ: ఫోన్పే, పేటీఎం వంటి పేమెంట్ అగ్రిగేటర్లలా పనిచేసేందుకు ఫిన్టెక్ కంపెనీ పేయూకి ఆర్బీఐ నుంచి అనుమతులు దక్కాయి. కంపెనీ అప్లికేషన్ను కిందటేడాది జనవరిలో ఆర్బీఐ తిరస్కరించింది. 120 రోజుల్లో తిరిగి సబ్మిట్ చేయాలని అప్పుడు అడిగింది. అనుమతులు దక్కడంతో ప్రోసస్ గ్రూప్కు చెందిన ఈ కంపెనీ ఇక నుంచి కొత్త మర్చంట్లను చేర్చుకోవడానికి, పేమెంట్ సర్వీస్లను అందించడానికి వీలుంటుంది.
ప్రభుత్వ డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్, ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం దేశంలో డిజిటైజేషన్ను విస్తరించడానికి తాజాగా పొందిన లైసెన్స్ సాయపడుతుందని పేయూ సీఈఓ అనిర్బన్ ముఖర్జీ అన్నారు.